అత్యంత విషాదకరమైన సంఘటన హైదరాబాద్ శివరులోని శాతవాహన కాలనీలో జరిగింది. ఒక తల్లి తన కుమారుడిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి శాతవాహన కాలనీ లో నివసించే మమత అనే 25 ఏళ్ల వివాహిత మూడు అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
అంతకు ముందే ఆమె తన కన్న కొడుకు అయిన మూడు సంవత్సరాల రియాన్ష్ ను హత్య చేసింది. భర్త వేధింపుల కారణంగానే మమత ఈ దారుణానికి పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.