38.2 C
Hyderabad
April 29, 2024 20: 22 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

కొడుక్కి తల కొరివి పెట్టిన తల్లి

mother

తాను చనిపోతే తల కొరివి పెట్టాల్సిన కొడుక్కి తల్లే ఆ పని చేయాల్సిన సంఘటన మంగళ వారం గన్నవరం లో చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి చిట్టూరి మురళి స్థానిక కోనాయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం సత్యం న్యూస్ వీక్షకులకు విదితమే. పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి సోమవారం తరలించారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడ పని పూర్తి కాగానే అంబులెన్స్ లో మృతదేహాన్ని గన్నవరం తరలిస్తుండగా కేసరపల్లి వద్ద మృతుడు మురళి బంధువులు, స్నేహితులు ర్యాలీగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో యువకులకు పోలీసుల మధ్య కొద్ధి సేపు వాగ్వాదం జరిగింది. బైక్ ర్యాలీకి అనుమతులు లేవని ఒక్క అంబులెన్స్ కి మాత్రమే అనుమతినిచ్చారు. దీనితో వ్యాన్ లో మృతదేహాన్ని మురళి ఇంటికి తరలించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని స్మశానానికి తరలించారు. మురళి తండ్రి గోపి  షుమారు ఎనిమిదేళ్ల కిందటే చనిపోయాడు, కాగా అతనికి తల్లి, అక్క,చెల్లి మాత్రమే ఉన్నారు. దీనితో తల్లి పార్వతి మృతుడు మురళికి తల కొరివి పెట్టింది.

Related posts

సిస్టర్ సెంటిమెంట్: షర్మిలమ్మకు రాజ్యసభ టిక్కెట్

Satyam NEWS

రైతులకు ఉచితంగా శానిటిజర్ ల పంపిణీ

Satyam NEWS

అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్: నగదు, బంగారం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment