28.7 C
Hyderabad
April 27, 2024 05: 33 AM
Slider ప్రత్యేకం

అమరావతి నుంచి రాజధాని మార్పునకు ముహూర్తం ఖరారు

#AndhraPradeshSecretariat

అమరావతి నుంచి రాజధానిని మార్చేసేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖారారు అయింది.

విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

స్వరూపానందేంద్ర సరస్వతి నిర్ణయించిన ప్రకారం మే 6వ తేదీ కల్లా అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు విశాఖ పట్నం చేరుకోవాలి.

ఆ రోజు నుంచి విశాఖ పట్నంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎక్కడా లిఖితపూర్వక ఆదేశాలు వెలువడలేదు కానీ అందరికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించిన వెంటనే అమరావతి నుంచి రాజధానిని తరలించడం ఖాయమని అనుకున్నారు కానీ ఇంత త్వరగా ముహూర్తం ఖరారు చేస్తారని ఎవరూ అనుకోలేదు.

అయితే ప్రస్తుతం మూఢాలు ఉన్నందున అవి అయిపోగానే విశాఖపట్నం రావాల్సిందిగా స్వామి సర్వూపానందేంద్ర సరస్వతి ఆదేశించారని అంటున్నారు.

మే 5 తేదీతో అమరావతి నుంచి శాఖల అధిపతులు పని చేయడం మానివేస్తారు.  

Related posts

పిచ్చెక్కిన పాకిస్తాన్ కాల్పుల్లో మరో ముగ్గురు వీరసైనికుల మరణం

Satyam NEWS

సింగిరెడ్డి యువసేన ఆధ్వర్యంలో గణనాధుడికి ప్రత్యేక పూజలు

Satyam NEWS

ఆకాష్ పూరి-రాహుల్ విజయ్ ముఖ్య అతిధులుగా “నేనెవరు” ఆడియో & ప్రోమో విడుదల

Satyam NEWS

Leave a Comment