ఆర్టీసీ బస్ లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు గుండె పోటుతో బస్ లోనే మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
మరిపెడ మండలం ఎల్లంపేట శివారు మంచ్యా తండా కు చెందిన మూడ్ భీముడు అనే వ్యక్తి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ మహబూబాబాద్ లోని హాస్పిటల్ లో చూపించుకునేందుకు భార్య తో కలిసి చిన్నగూడూరు మండల కేంద్రం లో మహబూబాబాద్ కు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కాడు.
కొద్ది దూరం ప్రయాణించిన తరువాత భీమా బస్ లోనే మృతి చెందాడు. బస్ డ్రైవర్ హరి మృతదేహం తోనే బస్సు ను సరాసరి మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ప్రయనికులందరిని గమ్యస్థానాలకు పంపించి, పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.