బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు రావడం ఇష్టం లేకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్వారంటాయిన్ కు వెళ్లారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ గోదా రమేష్ కుమార్ తరపున ఆయన నెల్లూరు జిల్లా సర్వేపల్లి, వెంకటాచలం మండలం లో ప్రచారం నిర్వహించారు.
నవతరం పార్టీ అభ్యర్థి కి గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్ధించారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ ని ఓడించేందుకు గ్లాసు గుర్తు కు ఓట్లు వేయాలని ఇంటింటికి తిరిగి ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో బత్తుల అనిల్ నవతరం పార్టీ నేతలు పాల్గొన్నారు.