40.2 C
Hyderabad
April 26, 2024 14: 15 PM
Slider నల్గొండ

వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయడం అవివేకం

#ysr

సూర్యాపేట జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ద్వంసం చేస్తున్న వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నల్లగొండ జిల్లా కో కన్వీనర్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆదెర్ల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా తాళ్ల కంపహాడ్ లో వై యస్ విగ్రహానికి నిప్పు పెట్టగా, ఆదివారం రాత్రి చిలుకూరు మండలం  కట్టకొమ్మ గూడెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ద్వంసం చేశారని ఇలా విగ్రహాలను ధ్వంసం చేయడం, పగలకొట్టడం అవివేకమని అన్నారు.

తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సుపరిపాలనలో ఎంతో మందికి లబ్ది చేకూరిందని అన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎందరో పేదలు కార్పొరేట్ వైద్యం చేయించుకొని హాయిగా జీవితం గడుపుతున్నారని గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్,

విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్, మహిళలకు పావలా వడ్డీ ఋణాలు, వృద్ధులకు,వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు,ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇలా ఎన్నో రకాల పథకాలు తీసుకువచ్చి తెలుగు ప్రజల గుండెల్లో మరపురాని నేతగా మిగిలిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు.

అంతటి మహనీయుని విగ్రహాలను పగులకొట్టి,ధ్వంసం చేయడం అవివేకమని,ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారు ఎంతటి వారైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

తుఫానుపై సిఎస్ డా.జవహర్ రెడ్డి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్

Bhavani

అంబర్ పేట్ లో పని చేయని తాగునీటి బోర్ లు

Satyam NEWS

కేంద్రం నిధులు దండుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment