భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బోధనెల్లి-కుర్ణపల్లి గ్రామాల మధ్యలోని ప్రధాన రహదారిపై మావోయిస్టుల వాల్ పోస్టర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక భారత స్వాతంత్ర్య పోరాట విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 90వ అమరత్వదినం “మార్చి 23 2022 నాడు” సామ్రాజ్యవాద వ్యతిరేకదినంగా పాటించలి అని మావోయిస్టు పార్టీ ఆ పోస్టర్ల ద్వారా పిలుపునిచ్చింది.
చర్ల-శబరి ఏరియా కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీల పేరిట వెలసిన వాల్ పోస్టర్ల పై పోలీసు లు ఆరా తీస్తున్నారు. మండల కేంద్రానికి కొద్ది దూరంలోనే ఈ గ్రామాలు వుండటం , పోస్టర్ లు , బ్యానర్లు వెలవటం పై పోలీసు వున్నాధికారులు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో అదనపు బలగాలతో కూంబింగ్ చేస్తున్నారు.