30.7 C
Hyderabad
April 29, 2024 03: 39 AM
Slider ప్రకాశం

పరిశ్రమలు తెచ్చి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తా

#Nara Lokesh

ప్రకాశం జిల్లా కి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తాం. హార్టి కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.

అరటి, మామిడి, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, బత్తాయి లో అనేక కొత్త రకాల మొక్కలు, అధిక దిగుబడి వచ్చే వెరైటీలు రీసెర్చ్ సెంటర్ ద్వారా అభివృద్ది చేస్తాం అని ఆయన అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద అలవలపాడు క్యాంప్ సైట్ వద్ద వలస కార్మికులు, గ్రామస్తులతో నారా లోకేష్ ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కి ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ ని తాము తీసుకొస్తే జగన్ తరిమేశాడని ఆయన వివరించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.

ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. స్వయం ఉపాధి కి సహకారం అందిస్తాం అని ఆయన అన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 6,500 కానిస్టేబుల్ పోస్టులు, డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి నిరుద్యోగులను జగన్ మోసం చేసాడని ఆయన గుర్తు చేశారు.

జాబ్ క్యాలెండర్ అని జగన్ ప్రభుత్వం మోసం చేసింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? అని ప్రశ్నించడంతో లోకేష్ ఈ సమాధానం చెప్పారు. సాగు నీరు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నాం.

సాగు, తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం అని లోకేష్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు. కనిగిరి నియోజకవర్గం వలస కార్మికులతో లోకేష్ మాట్లాడుతూ కనిగిరి లో వలసలు ఆపడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం.

సాగు, తాగు నీరు అందించి వలసలకు చెక్ పెడతాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకాశం జిల్లా కి పరిశ్రమలు తీసుకొస్తాం. అభివృద్ది, సంక్షేమం సైకిల్ కి రెండు చక్రాలు. సైకో పాలన పోతేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆయన తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ, సూక్ష్మ పోషకాలు, రైతు రథాలు, ఇతర యంత్రాలు గతంలో సబ్సిడీలు ఇచ్చే వాళ్ళం.

ఇప్పుడు జగన్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసాడు. యువత ను వ్యవసాయం వైపు ప్రోత్సహించే విధంగా కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తాం. విద్య దీవెన, వసతి దీవెన చెత్త పథకాలు. ఈ కొత్త విధానం వలన తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఫీజులు చెల్లించక కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికేట్లు ఇప్పిస్తాం అంటూ లోకేష్ హామీ ఇచ్చారు.

పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య పథకాలను మళ్ళీ ప్రారంభిస్తాం. జగన్ ఇద్దరు పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. కానీ ఆయన విదేశీ విద్య పథకం రద్దు చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు విదేశాల్లో చదవకూడదా? అని లోకేష్ ప్రశ్నించారు.

Related posts

అయోధ్య .. ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధం..

Sub Editor

త్రిబుల్ తలాక్ కేసుల నమోదుపై స్టే ఇవ్వలేం

Satyam NEWS

సేఫ్టీ మెజర్స్: కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి అరెస్టు

Satyam NEWS

Leave a Comment