38.2 C
Hyderabad
April 29, 2024 19: 33 PM
Slider అనంతపురం

పరిటాల సునీత దీక్షను భగ్నం చేసిన పోలీసులు

#paritalasunita

టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె దీక్షను నేడు పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట వద్ద దీక్ష శిబిరం వద్దకు వెళ్లి బలవంతంగా పరిటాల సునీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సునీత, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై సునీత మండిపడ్డారు. అనంతరం ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సునీతకు లోబీపీ ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో వెంటనే ఆమెను వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పరిటాల అభిమానులు, టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.

Related posts

తెలుగుదేశం పార్టీ గెలవడంతో వైసీపీ ఏం చేసిందో తెలుసా?

Satyam NEWS

విత్ యు:కడ దాకా కలిసే వృద్ధ దంపతుల ఆత్మహత్య

Satyam NEWS

పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment