కడప నగరంలో ప్రైవేట్ హాస్పిటల్ మరియు ల్యాబ్ వారు పేద ప్రజల దగ్గర నిలుపుదోపిడీ చేస్తున్నారని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోటపాటి లక్షుమయ్య అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎవరన్నా జ్వరం, దగ్గు మరియు జలుబు వంటి సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్ కు పోతే ఇదే అదను అనుకొని ఈ సీజన్లో ఇలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పి అలాగే టైఫాయిడ్ డెంగీ మలేరియా వంటి సమస్యలు ఎక్కువ వస్తాయి అని చెప్పి వాళ్లను భయాందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి రక్త పరీక్షలు చేయాలని చెప్పి వందలలో అయ్యే రక్త పరీక్షలకు వేల రూపాయలు తీసుకుంటూ పేద వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన అన్నారు.
ఇంత డబ్బులు ఎందుకని అడిగితే వాటి రక్తపరీక్షలకు అంతా డబ్బులు అవుతాయి అని మాట్లాడుతున్నారు. పేద వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి హాస్పిటల్ మరియు ల్యాబ్ ల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే కడప నగరంలో ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్స్ కు, ల్యాబ్ లకు అనుమతులు లేవు అటువంటి వాటిని గుర్తించి వెంటనే సీజ్ చేయాలని యువజన కాంగ్రెస్ తరపున మేము డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పాలగిరి శివ, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖయ్యూం యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షులు దాసరి శివ శంకర్ యువజన కాంగ్రెస్ నాయకుడు నిజాం మరికొందరు పాల్గొన్నారు.