40.2 C
Hyderabad
April 26, 2024 11: 46 AM
Slider చిత్తూరు

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

#NBSudhakarreddy14

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐ పి సి 124B సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని రఘురామపై అభియోగాలుక నమోదు చేశారు. ప్రభుత్వంపై ఇటీవల ఆయన పలు అవినీతి ఆరోపణలు చేశారు. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ని అడ్డుకునేందుకు సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు. అయితే ఏపి పోలీసులు వారి మాట వినలేదు. సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు  సమాచారం ఇచ్చి రఘురామ కృష్ణంరాజు ని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఎంపి రఘురామరామ కృష్ణంరాజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అకారణంగా మా నాన్నని అరెస్ట్ చేశారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కుమారుడు భారత్ కామెంట్ చేశారు. మధ్యాహ్నం 3.30కి 30మంది పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారని ఆయన అన్నారు. ‘‘4నెలల క్రితం మా నాన్నకు బైపాస్ జరిగింది. ఓ ఎంపీని 30మంది పోలీసులు సీఆర్పీఎఫ్ సిబ్బందిని నెట్టేసి తీసుకు పోయారు. మా నాన్నని ఎక్కడికి తీసుకు వెళ్లారో తెలీదు. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, పోలీసుల దగ్గర వారెంట్ లేదు’’ అని ఆయన అన్నారు.

Related posts

కబ్జాల కు గురికాకుండా చెరువులను కాపాడండి

Satyam NEWS

పొంగి పొర్లుతున్న డ్రైనేజి నీళ్లు

Satyam NEWS

పోలింగ్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన తూర్పగోదావరి ఎస్ పి

Satyam NEWS

Leave a Comment