రాజమండ్రి సెంట్రల్ జైలు ను కరోనా వదలడం లేదు. తాజా గా 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు సెంట్రల్ జైలు లో 52 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
సెంట్రల్ జైలు లో మొత్తం 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 28 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి ఇప్పటికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఇంకా 900 పరీక్షల రిపోర్ట్ లు పెండింగ్ లో ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైల్ లో మూలాఖత్ ను అధికారులు నిలిపివేశారు.