26.7 C
Hyderabad
April 27, 2024 10: 51 AM
Slider జాతీయం

కరోనా ఎఫెక్ట్: రాజస్థాన్ రాష్ట్రం మొత్తం 31 వరకూ షడ్డౌన్

Ashok Gehlot

రాజస్థాన్ ను నెల 31 వరకు రాష్ట్రాన్ని షట్‌డౌన్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ప్రకటించారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. సీఎం ఆదేశాలతో నిన్న అర్ధరాత్రి నుంచే రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర సేవలు తప్ప మాల్స్, షాపులు, ఇతర దుకాణాలు అన్నీ మూతపడ్డాయి.

షట్‌డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం అర్హులందరికీ ఉచితంగా గోధుమలు పంపిణీ చేస్తున్నారు. రాజస్థాన్‌లో శనివారం కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల మొత్తం సంఖ్య 23కు పెరిగింది. కరోనా బాధితుల్లో నాలుగున్నరేళ్ల బాలిక ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

Related posts

మాదగలకు మంత్రివర్గంలో స్థానం కావాలి

Satyam NEWS

ఆశ వర్కర్ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

Satyam NEWS

కూకట్ పల్లిలో హై టెక్ పేకాట రాకెట్ పట్టివేత

Satyam NEWS

Leave a Comment