శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం పిండ్రువాడ గ్రామంలో ఎం.జి.ఆర్ యువసేన సభ్యులు సంక్రాంతి ముగ్గులు పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45 మంది పొటీదారులు పాల్గొన్నారు. వీరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికికి ప్రైజ్ మనీగా 5,000/-, 2,000/-, 2,000/- అందచేశారు. సెకండ్ ప్రైజ్ ఐదు గురికి, థర్డ్ ప్రైజ్ ముగ్గురి కి దక్కింది. పాతపట్నం నియోజకవర్గం టి.డి.పి యువ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు (ఎం.జీ.ఆర్ ) బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎం.జి.ఆర్ మాట్లాడుతూ ప్రతీ ఏడాది సంక్రాంతికి ముగ్గులు పోటీ నిర్వహించి ఆడపడుచులకు కానుకలను బహుమతుల రూపంలో అందించడం ఆనవాయితీ గా వస్తున్నదని అన్నారు. ఈ సంవత్సరం పిండ్రువాడ గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
సంక్రాంతి పర్వదినానంగా ఆడపడుచులకు కానుకలతో పాటు ప్రతీ ఇంటికి వెళ్ళి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిుజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండ చిన్నమ్మి,(దండాసి) తంగి రమేష్, కరణం సత్యన్నారాయణ, పిల్లా ప్రశాంత్ కూమార్, కారణం వెంకటరమణ,యడ్ల జోగారావు, ఎస్ దాలిరాజు,డిల్లి, తదితరులు పాల్గొన్నారు.