38.2 C
Hyderabad
April 29, 2024 14: 39 PM
Slider ముఖ్యంశాలు

మీ కుటుంబ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయండి…!

#MP Bandi Sanjay Kumar

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాళా ‌తీయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ’’సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? అనే వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు. అట్లాగే 2014 నాటి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, నేటి ఆర్దిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారనే అంశాలపైనా శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.

మద్యం ద్వారా తెలంగాణలో ఒక్కో కుటుంబం ఏటా రూ.50 వేల ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వానికి ఇస్తే… ఆ ప్రజలకు మాత్రం ఒక్కో కుటుంబంపై 6 లక్షల అప్పు మోపి గిఫ్ట్ గా ఇచ్చారని ఎద్దేవా చేశారు. మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామిగా దూసుకెళ్తోందని చెప్పిన బండి సంజయ్ 2047 నాటికి పూర్తిస్థాయిలో ఆర్దికంగా అభివృద్ధి చెందిన దేశంగా ‘‘భారత్’’ను చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు, తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా బండి సంజయ్ చేసిన మాట్లాడారు.

జేపీ నడ్డా తిరిగి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనందున తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున హ్రుదయపూర్వక అభినందనలని,
ఈ కార్యవర్గ సమావేశాల్లో వ్యవసాయ, రాజకీయ తీర్మానాలతోపాటు అనేక అంశాలపై చర్చించబోతున్నామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తి నిరాశ, నిస్ర్పహలు, కష్టాల్లో ఉన్నారు… జరిగేఈ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపట్ల ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దళిత హామీలు నెరవేర్చలేదు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. కనీసం పరిశీలించలేదు. సెక్రటేరియెట్ నిర్మాణ పనులను మాత్రం 10సార్లు సందర్శించారు. కేసీఆర్ ఫుట్టిన రోజునాడు సచివాలయం ప్రారంభిస్తారట.

నేనడుగుతున్నా…. నీ పుట్టిన రోజునాడు సచివాలయాన్ని ఎట్లా ప్రారంభిస్తారు? సచివాలయం సొమ్ము ప్రజలది. అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు .
కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో కొత్త డ్రామా. జాతీయత, జాతీయ భావం లేని పార్టీ బీఆర్ఎస్… దేశభక్తితో జాతీయ భావంతో పనిచేసే పార్టీ బీజేపీ. పోలింగ్ బూత్ సమావేశం మొదలు జాతీయ సమావేశాల దాకా వందేమాతరం, జనగణమన ఆలపిస్తాం..తల్లి భారతిని స్మరించుకుందామని. . అటక్ నుండి కటక్ దాకా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే పార్టీ బీజేపీ అని కరీంనగర్ ఎంపీ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల దారి మళ్లించేందుకు కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నరు. కేసీఆర్… తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు? రాష్ట్రాన్ని ఎందుకు దివాళా తీయించావో ప్రజలకు సమాధానం చెప్పిన తరువాత మిగిలిన అంశాలపై మాట్లాడాలి. జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ దేశానికి ఏం చేయబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మోడీ నాయకత్వంలో భారత్ ను ఆర్దికంగా అభివ్రుద్ధి చేస్తున్నారు. ప్రపంచంలోనే 5వ స్థానంలోకి చేరారు. మరో రెండు మూడేళ్లలో 3వ స్థానానికి చేరుకుంటామని. . కానీ మా లక్ష్యం ఒక్కటే… భారత్ 100 ఏళ్ల స్వాతంత్ర్యం నాటికి భారత్ ను పూర్తిస్థాయిలో ఆర్ధికంగా అభివృ ద్ధి చెందిన దేశంగా చూడబోతున్నామని.. 2047 నాటికి మన కల నెరవేరబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.ఇదంతా తెలిసే… జీ-20 దేశాలకు ప్రధాని మోడీ..

నాయకత్వం వహించాలని ఆయా దేశాలు కోరాయి. కాబట్టి ప్రజలంతా అన్ని విషయాలను ఆలోచించాలని కోరుతున్నా..కేంద్రం తెలంగాణకు అన్ని విధాలా సహకరిస్తున్నా, నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని విమర్శించారు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.ఈ వేదిక నుండి సవాల్ చేస్తున్నా… అసెంబ్లీ సాక్షిగా 2014లో మీరు, మీ కుటుంబ ఆస్తుల వివరాలేంది? ఇప్పుడు మీవి, మీ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలపై శ్వేత ప్రత్రం విడుదల చేయాలని కోరారు.. బండి సంజయ్.

ఇక రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు, నిధులు కేటాయింపుపైనా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై మనమంతా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలవారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలి. వాటి అమలు కోసం పోరాడాలి. ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు.

317 జీవోపై టీచర్లు చేసిన పోరాటాలను మనం చూస్తున్నాం.. పోలీసుల అమానుష చర్యలను చూశాం. చిన్నపిల్లలు, మహిళలని కూడా చూడకుండా రాత్రంతా స్టేషన్ లో ఉంచారు. వారిపై దీక్ష చేస్తే నన్ను కూడా జైల్లో పెట్టారే తప్ప ఆ జీవోను సవరించడం లేదు. ఈ విషయంలో ప్రగతి భవన్ ను ముట్టడించి సమస్య తీవ్రతను ప్రజల్లోకి తీసెకెళ్లిన బీజేపీ మోర్చాల పనితీరు భేష్ అని ప్రశంసించారు.

317 జీవో పేరుతో ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోమని ఈనెల 30లోపు ఆ సమస్యను పరిష్కరించాలని.. భేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో 30న ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున దర్నా చేపట్టి నీ మెడలు వంచుతామని. . ఆ సమస్య పరిష్కరించేదాకా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులు 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేస్తేనే తెలంగాణ వచ్చి నువ్వు సీఎం అయ్యావనే విషయాన్ని గుర్తుంచుకోవాలే అని కరీంనగర్ ఎంపీ అన్నారు.

బీజేపీ నాయకులు సొంత మైలేజీ కోసం పనిచేయొద్దని.. సొంత ఎజెండా కోసం పనిచేసేవాళ్లు బీజేపీ నాయకులే కాదు… మోడీ నాయకత్వంలో పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేవారే అసలైన నాయకులని.. సిద్దాంతాల కోసం ప్రాణ త్యాగం చేసిన నేతల ఆశయాలను నెరవేర్చాలని. తెలంగాణ కోసం బలిదానమైన 1400 మంది ఆశయాలను సాధించాలంటే… ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలే అని అన్నారు.

ప్రజా సమస్యలపై నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుగుణాకర్ రావు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడాన్ని అభినందిస్తున్నానన్నారు. మనందరం ప్రజల బాధలను పంచుకోవాలి. ఆందోళనలను తీవ్ర స్థాయిలో చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

సీఎం కేసీఆర్ నీచుడని. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎంతటి నీచానికైనా పాల్పడతాడని. కుటుంబాలను, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు వెనుకాడరని చెప్పారు. వీడియోలు, ఫొటోల పేరుతో దుష్ర్పచారం చేస్తూ బీజేపీ మైలేజీని తగ్గించి ప్రజల దృ ష్టించే కుట్ర చేస్తున్నడు. సమాజాన్ని అయోమయంలోకి నెట్టేందుకు యత్నిస్తాడని.. వాటికి భయపడొద్దని. పేదల రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటే అనేక అడ్డంకులు వస్తుంటాయని.

వాటిని అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళదామని.. తెలంగాణకు జాతీయ పార్టీ అండగా ఉందని స్పష్టం చేశారు.. బండి సంజయ్.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తామన్నారు. పేదలకు ఇండ్లు కట్టిస్తాం. పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా కింద పరిహారం చెల్లిస్తామని అన్నారు. ఈ హామీలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు.

అంతిమంగా రాష్ట్రంలో కొనసాగుతున్న రజాకార్, రాక్షస రాజ్యానికి చరమగీతం పాడి బీజేపీ ఆధ్వర్యంలో రామరాజ్య స్థాపనకు క్రుషి చేయాలని మీ అందరినీ కోరుతూ ముగిస్తున్నాని పదాధికారుల సమావేశం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడి తన ప్రసంగాన్ని ముగించారు.ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తూ ఇటీవల మరణించిన బీజేపీ కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామని బండి సంజయ్ అన్నారు.

Related posts

క్రికెట్ బెట్టింగ్ లకు అడ్డా పెదవేగి గడ్డ

Satyam NEWS

భారతీయుడి కోసం పాక్ కోర్టుల్లో పోరాడుతున్న పాక్ పౌరుడు

Satyam NEWS

40వేల కుటుంబాలను ఆదుకున్న కోమటిరెడ్డి

Satyam NEWS

Leave a Comment