42.2 C
Hyderabad
April 26, 2024 17: 38 PM
Slider ఖమ్మం

అక్రమ దందాలు సాగిస్తున్న  విలేకర్లు అరెస్టు

#Khammam dist reporters

విలేకర్ల ముసుగులో అక్రమ దందాలు కొనసాగిస్తూ.. బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న నాలుగురు విలేకర్లపై సత్తుపల్లి పోలీసు స్టేషన్ లో  కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వేంకటేశ్ వివరాలు వెల్లడించారు.

దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన కఠారి పుల్లారావు బుధవారం రాత్రి  సమయంలో 10 క్వింటాల బియ్యాన్ని ఆటోలో  బైపాస్ రోడ్డు వైపుగా తరలిస్తుండగా  కొందరు విలేకర్లు ఆటోను అడ్డగించి తాము విలేకరులమంటూ మాకు ముప్పై వేలు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకుంటే నీ అంతు చూస్తామని తన నుంచి రూ. 24 వేల నగదు తీసుకొని మిగిలిన ఆరు వేల రూపాయలు ఇచ్చి ఫోన్ తీసుకెళ్లమని, స్మార్ట్ ఫోన్ ను లాక్కెళ్లారని పుల్లారావు ఫిర్యాదు చేయడంతో సత్తుపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టినట్లు తెలిపారు.

విచారణలో  ఐన్యూస్ రిపోర్టర్, సుభనందిని చిట్ ఫండ్ మేనేజర్ తడికమల్ల అప్పారావు, మెట్రో న్యూస్ పేపర్ రిపోర్టర్ చింతోజీ రమేష్ , ప్రజాపక్షం న్యూస్ పేపర్ రిపోర్టర్ ఐదుపాలాపాటి క్రిష్ణ ,  ప్రజా కలం న్యూస్ పేపర్ రిపోర్టర్ కొమరాపు వాసుదేవ @వాసు గా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

సత్తుపల్లిలో ఇటీవల  కొంతమంది నకిలీ విలేకర్లు ప్రముఖ దినపత్రికల్లో, న్యూస్ ఛానళ్లలో పనిచేసే పాత్రికేయుల పేరు వాడుకోవడంతో పాటు తాము ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు, దినపత్రికకు జిల్లా, డివిజన్ స్థాయి విలేకర్ల మంటూ..

వ్యాపారులను,కాంటాక్టర్లను, కార్యాలయాల్లో అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ… వసూళ్ల బాగోతానికి పాల్పడుతునట్లు ప్రముఖ  పత్రికలు ,న్యూస్ ఛానల్ రిపోర్టర్లు వాపోతున్నారని తెలిపారు.

విలేకర్ల ముసుగులో అక్రమ దందాలతో అందిన కాడికి దండుకోవడం రివాజుగా మారిందనే తీవ్రమైన  ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో  ఇలాంటి చట్టవిరుద్ధంగా చర్యలను ఉపేక్షించేది లేదని ఏసీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

అదేవిధంగా  విలేకర్లు కాని కొంతమంది  ద్విచక్ర వాహనాలకు ,కార్లకు ‘ప్రెస్’ స్టిక్కర్లు అంటించుకుని, నకిలీ ఐడి కార్డులు తయారు చేసుకుని అక్రమ దందాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని విచారణ చేపట్టి చర్య తీసుకుంటామని తెలిపారు..ఈ వ్యవహారంలో  బియ్యం తరలిస్తున్న ఆటోను, బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు స్వాధీనం చేయడ జరిగిందని ఈ మేరకు కేసు నమోదు చేసిన  సీఐ రమాకాంత్ దర్యాప్తు చేసిన్నట్లు తెలిపారు.

Related posts

ఎల్ వి సుబ్రహ్మణ్యంకు ప్రధాని కార్యాలయం పిలుపు

Satyam NEWS

స్పెషల్ ఆఫర్: వస్తవా వరంగల్లుకు అన్నీ ఇస్తా

Satyam NEWS

ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా కుడుముల సత్యం ముదిరాజ్

Satyam NEWS

Leave a Comment