రాజన్న సిరిసిల్లా జిల్లాలోని శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేడు రేవతి నక్షత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రేవతీ నక్షత్రోత్సవము కరోనా నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఉదయం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకము, పరివార దేవతార్చనలు నిర్వహించారు.
సాయంత్రం సదస్యము నిర్వహించారు.
అదే విధంగా మాస శివరాత్రి సందర్భంగా కళ్యాణమండపం లో స్థానాచారి అప్పాల భీమన్న ఆధ్వర్యంలో మహాలింగార్చన నిర్వహించారు.