26.7 C
Hyderabad
April 27, 2024 09: 00 AM
Slider చిత్తూరు

ఒక వ్యక్తి ప్రాణం తీసిన ఆర్ ఎం పి డాక్టర్

#RMPDoctor

చేతకాని డాక్టర్ చేసిన వైద్యం ఒక మనిషి ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా ములకలచెరువు లో ఈ దుర్ఘటన జరిగింది. ఒక ఆర్ ఎం పి డాక్టరు నిర్వాకం తో వైద్యం వికటించి ఒక వ్యక్తి మృతి చెందడం ఇక్కడ సంచలనం సృష్టించింది.

చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం సోంపాళ్యం పంచాయితీ పరిధిలోని కేసీ నగర్ కు చెందిన శంకరప్ప( 37) చెయ్యి నొప్పి అని అక్కడి ఆర్ ఎం పి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.

అక్కడ తెలిసి తెలియన వైద్యం చేయడంతో శంకరప్ప మరణించాడు. ఆర్ ఎం పి డాక్టర్ ఏవో ఇంజక్షన్లు ఇచ్చాడని అందువల్లే తన భర్త చనిపోయాడని శంకరప్ప భార్య బోరున విలపించింది.

కుటుంబంలో సంపాదించే ఒకే ఒక వ్యక్తి ఇలా ఆర్ ఎం పి డాక్టర్ చేతిలో మరణించడంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడ్డది. 

భార్య ఫిర్యాదు మేరకు ఆర్ ఏం పి డాక్టర్ నారాయణస్వామి, ఆయన కొడుకు మంజునాథ్ పై 304 a క్రింద కేసు నమోదు చేసినట్లు ములకలచెరువు ఎస్ ఐ రామకృష్ణ తెలిపారు.

మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Related posts

కోనసీమలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Satyam NEWS

పేదవారికి కూడా ఉత్తమమైన విద్య

Bhavani

ఘనంగా మదర్ థెరీసా 111వ జయంతి కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment