తెలుగుదేశం పార్టీ నీడలో పెరిగి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న సినీ నటి రోజా తన స్థాయి తెలుసుకోవడం మంచిదని తెలుగు మహిళ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. ఒక మహిళ అయి ఉండి అమరావతి రాజధాని మహిళలను అత్యంత నీచంగా సంబోధించడం రోజాకు తగదని అన్నారు.
ఒక సంప్రదాయమైన మహిళ నోటి నుంచి రాని మాటలు రోజా నోటి నుంచి వస్తున్నాయని, అదీ కూడా సాటి మహిళలపై ప్రయోగించడం పూర్తిగా ఖండిస్తున్నామని కాట్రగడ్డ ప్రసూన అన్నారు. తానూ ఒక మహిళ అనే విషయాన్ని రోజా మర్చిపోతే గుర్తు చేయడానికి తాము ఉన్నామని ప్రసూన అన్నారు. రాజధాని మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఎస్విబీసీ చైర్మన్ పృథ్వికి ఏ గతి పట్టిందో రోజారెడ్డికి కూడా అదే గతి పడుతుందని ప్రసూన అన్నారు.