చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి సీఎం జగన్ తప్పు చేశారని భావిస్తున్న వైసీపీ నేతలు ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలతో మరింత నష్టం జరుగుతున్నదని భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు పెరిగిపోయాయి.
అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ముందుకు వచ్చి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం యాక్టీవ్ అయిపోయింది. అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఈ నిరసన కార్యక్రమాలలో అప్పటి వరకూ ఏ రాజకీయ సమావేశంలో పాల్గొనని వర్గాల ప్రజలు కూడా పాల్గొంటున్నారు. చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును తటస్థులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పై ప్రస్తుతం పూర్తి స్థాయిలో సానుభూతి పవనాలు వీస్తున్నాయి. ఈ దశలో వైసీపీ నాయకులు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ చేపట్టిన పార్టీ కార్యక్రమాలు ఎక్కడా విజయవంతం కావడం లేదు. ఇలాంటి స్థితిలో సజ్జల రెడ్డి వ్యవహారం వైసీపీలో కలకలం రేపుతోంది. జగన్ రెడ్డికి తెలుస్తుందో లేదో కానీ… సజ్జల రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న ప్రతీ సారి వైసీపీకి, జగన్ రెడ్డికి మరో కిలోమీటర్ లోతైన గొయ్యి తవ్వేస్తున్నారని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.
అసలు ఆయనెవరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్న ప్రశ్న ప్రెస్ మీట్ పెట్టిన ప్రతీ సారి సామాన్యుల నుంచి వస్తుంది. కానీ తాను డీ ఫ్యాక్టో సీఎంనని ఆయన అనుకుని ప్రతీ సారి తెర ముందుకు వస్తున్నారు. సీఐడీ అధికారులు, జైలర్లు ప్రెస్ మీట్లు పెట్టే ముందు ఆయన వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడతారు. తర్వాత అధికారులు మాట్లాడతారు. ఈయన చెప్పిందే వాళ్లు ప్రెస్ మీట్లో చెబుతారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న మాటలు చూసి… వైసీపీ నేతలు కూడా అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై వెటకారం చేయడాన్ని ఎవరైనా సమర్థిస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్య సలహాదారు రూపంలో జగన్ రెడ్డి .. సైకో లక్షణాల్ని బాగా తెలుసుకుని ఆయనను సంతృప్తి పరుస్తూ.. కుట్రలు, కుట్ర స్కెచ్ లు వేస్తూ… అసలు నష్టం ఆయనే చేస్తున్నారని అనుమానిస్తున్నారు.
పార్టీ కార్యకర్తల్ని.. నేతల్ని సాక్షి చెప్పే మాటలే వినేలా చేసి.. బావిలో కప్పల్లా ఉంచుతూ… అందరూ అలాగే ఉంటున్నారని అనుకుంటున్నారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు నిజాలు తెలియనివ్వడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ రెడ్డికి ఎలాంటి నివేదికలు వెళ్తున్నాయో ఎవరికీ తెలియదు. చివరికి జగన్ రెడ్డి బహిరంగసభల్లో తిట్లు కూడా .. చూసి చదువుతారు. అలాంటిస్థితికి వచ్చిన ఆయనను సజ్జల రెడ్డి కీలుబొమ్మలా ఆడుకుంటున్నారని… జగన్ రెడ్డికి లోతైన గొయ్యి తవ్వుతున్నారన్న అసంతృప్తి ఆ పార్టీలో కనిపిస్తోంది.