12 జిల్లాల స్థాయి ఖేల్ కూద్ క్రీడలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లి సరస్వతి శ్రీ విద్యా పీఠం సమితి లో నేడు ప్రారంభించారు. శనివారం పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాటశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుడ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను,పోటీ తత్వాన్ని నేర్పుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డా. గుండ్లపల్లి శ్రీధర్, ప్రముఖ న్యాయవాది జూపూడి రంగరాజు, జెపియస్ శాస్త్రీ, కట్టా శంకరరావు, ప్రధానోపాధ్యాయులు బొర్రా వెంకట కృష్ణారావు, పోతుగంటి రామ కోటేశ్వరరావు, చిరుమామిళ్ల గోపి కృష్ణ, దోకిన నాగేశ్వరరావు , దేవరశెట్టి రవి కుమార్, అచ్యుత శివప్రసాద్, న్యాయవాది ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
previous post