40.2 C
Hyderabad
April 26, 2024 12: 07 PM
Slider నల్గొండ

ప్రజలందరికి శ్రీ తిరుపతమ్మ తల్లి దీవెనలు ఉండాలి

#srilaxmitirupatamma

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తిరుణాళ్ళు ఘనంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన వృషభ రాజాల బల ప్రదర్శన పోటీల ప్రారంభోత్సవానికి వైఎస్ఆర్ షర్మిలమ్మ పార్టీ అడహక్ కమిటీ సభ్యుడు ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కేతావత్ రామ నాయక్ హనుమాపురం, గుంటూరు జిల్లా, పోపూరి ఆదినారాయణ తోర్లపాడు గ్రామం కృష్ణా జిల్లాకు చెందిన రెండు ఒంగోలు జాతి కోడెల జతను ప్రారంభించి షీల్డ్ బహూకరించారు.

తర్వాత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గున్నం రమాదేవి నాగిరెడ్డి శ్రీనివాస రెడ్డిని శాలువాతో సత్కరించారు.

అనంతరం ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు.

ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండేందుకు అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ కలగాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాసనాల అంజి నాయుడు, తోట కోటి నాయుడు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రాణహిత పుష్కరాల ముగింపు రోజు అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

శోభాయమానంగా ధనుర్మాస శోభాయాత్ర

Satyam NEWS

శుభమస్తు

Satyam NEWS

Leave a Comment