ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్. రమేష్ కుమార్ ఈ రోజు ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్ల గురించి గవర్నర్ హరి చందన్ కు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వివరించారు.