కుప్పం పంచాయితీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన వై ఎస్ జగన్ అంతటితో సంతృప్తి చెందేలా కనిపించడం లేదు.
ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబునాయుడు అక్కడ అడుగు పెట్టకుండా చేయాలని పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారు.
కరోనా విపత్కర సమయంలో చంద్రబాబు నియోజకవర్గంకు రాలేదని, సంవత్సర కాలంగా నియోజకవర్గాన్ని పట్టించుకోని చంద్రబాబుకు ఇప్పుడెలా వస్తారని అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించేలా చేస్తున్నారు.
మంగళవారం రాత్రి టిడిపి నేతల ప్లెక్సీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దగ్ధం చేయడంతో కుప్పంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.
కుప్పంలో చంద్రబాబు గురువారం నుంచి మూడు రోజుల పర్యటన నేపథ్యంలో బాబు పర్యటనను అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్విగ్న పరిస్థితులు కుప్పంలో నెలకొని ఉన్నాయి.