వరంగల్ అర్బన్ జిల్లా ఏనుమాముల మార్కెట్ దగ్గరలోని రెడ్డిపాలెం కొత్తపేట రోడ్డులో ఉన్న ఒక వ్యవసాయ బావిలో ఒక యువతి మృతదేశం అనుమాస్పద స్థితిలో లభ్యం అయింది.
శుక్రవారం నాడు జరిగిన ఈ సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపుతోంది. ఉదయం స్థానికులు గమనించి సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అనుమానాస్పద పరిస్థితుల్లో యువతి మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ప్రాధమిక దర్యాప్తులో ఆ యువతిని ఏనుమాముల గ్రామం ఇందిరమ్మ కాలనీకి చెందిన నిఖిత ( 20 ) గా గుర్తించారు. అయితే ఇది హత్యా లేక ఆత్మహత్యా ? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.