హింసను ప్రేరేపించేలా ఉన్న డీజీపీ వ్యాఖ్యలపై కేంద్రహోమ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. అదే విధంగా పార్లమెంటులో చంద్రబాబు బస్సుపై దాడి అంశాన్ని ప్రస్తావించాలని ఎంపీలు నిర్ణయించారు. తుళ్లూరు సంఘటనలపై పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. వచ్చే 5న రాజధాని నిర్మాణంపై విజయవాడలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
చెప్పులు, రాళ్లు వేసిన వారిపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసనలకు అనుమతి ఎలా ఇచ్చారని నేతలు ప్రశ్నించారు. దీనికి అంతటికి కారణం అయిన డీజీపీ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.