కడప జిల్లా ప్రొద్దుటూరును అభివృద్ధి చేయాలని ఉందా లేదా చెప్పాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు పై తెదేపా ప్రవీణ్ రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమెల్యేగా మూడేళ్ల సమయం వృద్దా చేశారని ఆరోపించారు. ఏడాదికి ప్రొద్దుటూరులో 500 కోట్ల అభివృద్ధి చేస్తామని చెప్పి…ఏమి చెయ్యలేదన్నారు.
బడ్జెట్ సమావేశాలకు వెళ్లలేని ఎమ్మెల్యేని ఎన్నుకోవడం బాధాకరమన్నారు. ప్రొద్దుటూరులో పురపాలక పరిధిలో నీరు అస్తవ్యస్తంగా వస్తోందిని, ఆ నీరు తాగితే రోగాల భారిన పడటం ఖాయం అని ఆయన తెలిపారు.
కూరగాయల మార్కెట్ పడగొట్టి… పునర్నిర్మాణానికి ఇప్పటికీ నిధులు తేలేదని ఆరోపించారు. అధికారులు ఎమ్మెల్యే బామ్మర్ది ఎం చెప్తే అదే చేస్తున్నారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ప్రజల్లో మార్పు రావాలని, రాష్ట్రంలో తెదేపాను గెలిపించి..ప్రొద్దుటూరులో తనకు కూడా ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.