ఏలూరు జిల్లా పెదవేగి మండలం న్యాయం పల్లిలో టి డి పి కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కరడు గట్టిన కంచుకోట లా ఉన్న న్యాయంపల్లి చౌదరి ఏరియా ఒక్కసారిగా బీటలు వారింది. సొంతపార్టీ నాయకత్వం పై అసంతృప్తా? వై సి పి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారా అనే ప్రశ్న టి డి పి శ్రేణుల్లో రేకెత్తిస్తుంది.
దెందులూరు వై సి పి ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి, వై సి పి సీనియర్ నేత కొటారు రామ చంద్రరావు నేతృత్వంలో ఆదివారం న్యాయంపల్లి లో టి డి పి కి చెందిన 20 కుటుంబాలు వై సి పి లో చేరారు. వారందరిని ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి సాదరంగా ఆహ్వానించి వై సి పి కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు.
ఆదివారం న్యాయం పల్లి లో వై సి పి తీర్థం పుచ్చుకున్న 20 కుటుంబాలు కూడా టి డి పి ఆవిర్భావం నుండి టి డి పి లో బలమైన పునాది రాళ్లుగా వేళ్లూనుకుపోయారు. అటువంటి బలమైన టి డి పి పునాదులు పెకళించుకుని 20 కుటుంబాలు వై సి పి లో చేరడం పట్ల దెందులూరు లో వై సి పి ని బలోపేతం చేయడం లో ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి న్యాయం పల్లి నుండే తొలి పునాది వేశారని వై సి పి వర్గాలు చెప్పుకుంటున్నాయి.