విజయనగరం జిల్లాలో పగలు భానుడు భగభగ రా త్రి పూట ఉక్క పోతతో అల్లాడుతున్న సందర్భంలో విడ్డూరం ఏర్పడింది. గత రాత్రి అంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా కరెంటు పోవడం దీనికి తోడు ఈదురుగాలులు లో వాతావరణం ఒక్క సారి చల్లబడింది. ఆ సమయంలో భారీ వర్షం కురిసింది.
తెల్లారేసరికి ప్రచండ రూపంలో భానుడి రావలసి ఉండగా అందుకు విరుద్ధంగా ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతి కమ్ము కునుకు అగుపించింది.పొద్దుపొద్దున్నే సూర్యుడు తన కిరణాలతో ప్రజలను తట్టి లేపాల్సింది పోయి…చల్లటి వర్షపు గాలులు వీయసాగాయి.ఆ సమయంలో ఓ వైపు భానుడు.. మరో వైపు నల్లటి వర్షపు మేఘాలతో ఆకాశం కనిపించింది. దీంతో ఉదయాన్నే వేడి గాలలకు బదులు చల్లటి గాలులు వీయడంతో పాటు వాతావరణం మొత్తం చల్లబడటం విశేషం.