32.7 C
Hyderabad
April 27, 2024 01: 00 AM
Slider ఆధ్యాత్మికం

ఘనంగా ముగిసిన తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు

#LordBalaji

తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.

ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను క‌టాక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యులు అనంత, సిఇ ర‌మేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి ఆత్మహత్య

Satyam NEWS

తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్న తనయులు

Satyam NEWS

బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడమే కెసిఆర్ సంకల్పం

Satyam NEWS

Leave a Comment