ఎన్నిక ఏదైనా టిఆర్ఎస్ దే గెలుపు అని ములుగు టౌన్ అధ్యక్షుడు మేర్గు సంతోష్ అన్నారు. ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఇన్ చార్జిగా ఉన్న జిహెచ్ఎంసి లోని 146 వ డివిజన్ బౌద్ద నగర్ లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.
టిఆర్ఎస్ అభ్యర్ధి కంది శైలజ విజయం సాధించినందుకు ఆయన కార్యకర్తలతో కలిసి జాతీయ రహాదారిపై మిఠాయిలు పంచి బాణా సంచాను పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ మండలం నర్సాపూర్ పిఎసిఎస్ చైర్మన్ మాడుగుల రమేష్, టిఆర్ఎస్ పార్టీ ములుగు మండల యువజన విభాగం అధ్యక్షుడు నాజర్ ఖాన్, రాజా హుస్సెన్ ,md.సలీం, ఖాసీం, గోదాసి రాజుకుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.