మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఇద్దరు అనుమానస్పదస్థితిలో మరణించారు. రైలు పట్టాలపై రెండు మృతదేహాలు చిందరవందరగా పడి ఉన్నాయి. మృతుల్లో ఒకరు మహిళ కాగా, మరొకరు పురుషుడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది.
మహబూబాబాద్ -డోర్నకల్ రైల్వే స్టేషన్ల మధ్య ఆఫ్ లైన్లో గల 437/31 మైలురాయి వద్ద గుర్తు తెలియని వ్యక్తి, మహిళ మృతదేహాలు పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. కాగా, ఆ ఇద్దరు రైలు నుంచి జారీ పడి మృతి చెందారా..?
లేక ఆత్మహత్య చేసుకున్నారా…? అనేది తెలియాల్సి ఉంది. ఈ డెత్లపై పలు అనుమానాలు వస్తుండటంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.