28.7 C
Hyderabad
April 27, 2024 05: 03 AM
Slider ముఖ్యంశాలు

ఇద్దరు అనుమానస్పద మృతి

#deaths

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఇద్దరు అనుమానస్పదస్థితిలో మరణించారు. రైలు పట్టాలపై రెండు మృతదేహాలు చిందరవందరగా పడి ఉన్నాయి. మృతుల్లో ఒకరు మహిళ కాగా, మరొకరు పురుషుడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది.

మహబూబాబాద్ -డోర్నకల్ రైల్వే స్టేషన్‌ల మధ్య ఆఫ్ లైన్‌లో గల 437/31 మైలురాయి వద్ద గుర్తు తెలియని వ్యక్తి, మహిళ మృతదేహాలు పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. కాగా, ఆ ఇద్దరు రైలు నుంచి జారీ పడి మృతి చెందారా..?

లేక ఆత్మహత్య చేసుకున్నారా…? అనేది తెలియాల్సి ఉంది. ఈ డెత్‌లపై పలు అనుమానాలు వస్తుండటంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Related posts

మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంట సాగుకు మొగ్గు చూపాలి

Satyam NEWS

జానపద కళాకారులను ఆదుకున్న రమణాచారి

Satyam NEWS

గోవుల మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు డీజీపీ ఆదేశం

Satyam NEWS

Leave a Comment