విజయనగరం జిల్లా టీడీపీ కి మంచి రోజులు వస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా మాన్సాస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు వ్యవహారంపై హైకోర్టు..ఈఓ తీసుకున్న చర్యలపై స్పందించిన సంగతి విదితమే.
ఇదిలా ఉంటే పార్టీ జిల్లా నేతలు ఐవీపీ రాజు ,విజ్జపు ప్రసాద్,టీడీపీ మైనార్టీ సెల్ మహిళా విభాగపు నేత అనురాధ బేగం లు నగర రోడ్లపై విజయనగరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు.
జగన్ పాలనలో అడుగడుగునా అవినీతి సంత..రహదారి లో అడుగుకొక గుంత అంటూ నగరంలో రహదారుల పరిస్థితి పై ద్వజమెత్తింది.గత టీడీపీ పాలనలో రోడ్లన్నీ పూలపాన్పువలే ఉండేవని పార్టీ నేతలు గుర్తు చేసారు.