రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, కడప పార్లమెంటు సభ్యుడు వై ఎస్ అవినాష్ రెడ్డి తల్లికి గుండె పోటు వస్తే సరైన వైద్యం చేయించాలని, అందుకు వెంటనే హైదరాబాద్ తరలించాలని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ నాయకుడు కె. రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. అత్యంత ముఖ్యమైన వ్యక్తి తల్లికి గుండె పోటు వస్తే పులివెందులలోనో, కడపలోనో చూపించడం సమంజసం కాదని ఆయన అన్నారు.
అందుకోసం తక్షణమే హైదరాబాద్ తరలించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిన్నికి ఇంత కష్టం వస్తే చూస్తూ ఎలా ఊరుకుంటారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతిపాత్రుడైన తమ్ముడు అవినాష్ రెడ్డికి ఇంత కష్టం వస్తే తీర్చేందుకు తక్షణమే ఆయన కూడా పులివెందులకు వెళ్లాలని, అందుకు ప్రత్యేక విమానం ఉపయోగించుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. ఆమెకు నిజంగా అంత సీరియస్ అయితే జగన్ రెడ్డి ముషి ముషి నవ్వులతో జగనన్నకు వాలంటీర్ వందనం లో ఎందుకు ఉన్నారు అని ఆయన ప్రశ్నించారు.