సీఎం జగన్ పై నమ్మకం లేక సొంత చెల్లెలు వై ఎస్ షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహా రెడ్డి విమర్శించారు. కడప జిల్లా కమలాపురం లోని టిడిపి కార్యాలయంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత చిన్నాన్న హత్య కేసును ఇప్పటి వరకు తేల్చలేని సీఎం రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులేనని ఆయన అన్నారు. సిబిఐ ని కూడా స్వతంత్రంగా పని చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆయన అన్నారు.
previous post