కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని చిన్న దదిగి గ్రామంలో ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. గత మూడు రోజుల నుండి ప్రత్యేక పూజలు భజనల అనంతరం శుక్రవారం వేద మంత్రల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు.
కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరు కాగా స్థానిక గ్రామస్థులు వారిని సన్మానించారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపిపి అశోక్ పటేల్, మాజీ జడ్పీటీసీ సాయిరాం, నల్చర్ రాజు, సర్పంచ్ అనిత విట్ఠల్ రెడ్డి గ్రామస్థులు, ఆయా గ్రామల సర్పంచ్ లు ఎంపీటీసీ లు పాల్గొన్నారు.