యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సూర్యకళావతి నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించిన సూర్యకళావతి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన కార్యాలయంలో కలిసిన వైస్ ఛాన్సలర్ సూర్యకళావతి ముఖ్యమంత్రికి పుష్ప గుచ్ఛం అందచేశారు.
2018-19 సంవత్సరంలో పాలనా మంజూరు అయి నిధులు విడుదల కాని విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. యూనివర్శిటీలో తాము చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలను ఆమె ముఖ్యమంత్రి కి వివరించారు. యూనివర్శిటిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల సహకారముంటుందని ముఖ్యమంత్రి, వైస్ ఛాన్సలర్ కు హామీ ఇచ్చారు.