30.7 C
Hyderabad
April 29, 2024 05: 43 AM
Slider ముఖ్యంశాలు

వైఎస్సార్సీపీ మంత్రులు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు

జగన్ ప్రభుత్వం లో ఉన్న అదే కాపు వర్గానికి చెందిన మంత్రులు… కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని…విజయనగరం టీడీపీ పార్లమెంటరీ నేత కిమిడి నాగార్జున విమర్శించారు. విశాఖ లో ఇటీవలే జనసేన అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు…చాలా రోజుల కు తేరుకుని… ఇప్పుడు మంత్రులు ఆ వ్యాఖ్యలు ఖండించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అంటే జనసేన పార్టీ కి జగన్ ప్రభుత్వం లో మంత్రులు భయపడుతున్నారని అనుకోవచ్చా అని.. అన్నారు. ఇక జగన్ ప్రభుత్వం లో పాలన అంతా రెడ్డిల చేతులలోనే నడవటం లేదా…మరి..దానికి స్పందించని ఈ కాపు మంత్రులు.. జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలకు ఎందుకు స్పందించారని నాగార్జున ప్రశ్నించారు. అసలు జగన్ ప్రభుత్వం లో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి… జగన్మోహన్ రెడ్డి వీళ్లంతా ..కాపు కులాన్ని చేస్తున్న అన్యాయం పై అదే కాపు మంత్రులు స్పందించరేం అని నాగార్జున సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఏం జరుగుతుందో… ప్రతీ ఒక్కరికి తెలుసునని…తాజాగా కాపు వర్గానికి చెందిన మంత్రులు ఏకమై…. అదీ విశాఖ లో మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు… నాగార్జున. పోనీ విశాఖ కు వచ్చిన ఆ మంత్రులంతా… ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడకుండా…. అదే విశాఖ లో జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలకు స్పందించి మాట్లాడటం..ఎంతవరకు సబబో ఆ వర్గానికి చెందిన మంత్రులు వ్యాఖ్యలకే వదిలేస్తున్నామన్పారు.

పైపెచ్చు… జగన్ ప్రభుత్వం లో సీనియర్ మంత్రి అయిన బొత్స వర్గానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో అది మాట్లాడక…జనసేన చేసిన వ్యాఖ్యలపై స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు…. టీడీపీ నేత నాగార్జున.

Related posts

తీన్మార్ మల్లన్నకు పోలీసు వేధింపులపై డీజీపీకి నోటీసు

Satyam NEWS

బ్రూటల్ కిల్లింగ్: మాజీ స్నేహితురాలిపై పెట్రోలుతో దాడి

Satyam NEWS

కడప నగరంలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన

Satyam NEWS

Leave a Comment