40.2 C
Hyderabad
April 26, 2024 13: 00 PM
Slider నల్గొండ

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి

#YSRTP

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి ఆదెర్ల శ్రీనివాస రెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 25వ,వార్డులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను సోమవారం  ఆదెర్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో  ఆవిష్కరణ,పార్టీ చేరికలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన 200 మందికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం కార్యకర్తల సమక్షంలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆదెర్ల మాట్లాడుతూ సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి అందించే లక్ష్యంతో వైఎస్ షర్మిల సారథ్యంలో ఏర్పాటైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో ఎగురవేయాలని,ప్రతి గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వైయస్సార్ తెలంగాణ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.నియోజకవర్గంలో పలు సమస్యలపై ప్రజల పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు.రేపటినుండి నియోజకవర్గంలోని 7 మండల కేంద్రాలతో పాటుగా గ్రామ,గ్రామాన జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎండి.రహీమ్, వెన్నం శ్రీను,సత్యనారాయణ,గుంటి సీతయ్య,గజవెల్లి సీతారాం,బూడిద వెంకటేశ్వర్లు,ములకపల్లి రాము,నాయని లక్షణరావు,ములకలపల్లి కొండలు,తురక మురళి,తురక శ్రీదేవి,ములకలపల్లి ఏడు కొండలు,మహబూబ్ అలీ,నలమాద వెంకటేశ్వర్లు,తురక రమేష్,షేక్.జాకీర్, రామిశెట్టి అంజి,లింగరాజు,రావులపాటి సైదులు,మాలోతు శివ,సిహెచ్. శివయ్య, చక్రాల రామకృష్ణ,దుంపల గోపి,ఆవుల సాయి కుమార్,బండి శ్రీనివాస్, మట్టారెడ్డి,శివారెడ్డి,నాయిని లక్ష్మణ్, ఫిరోజ్,పర్వతం తిరుపతమ్మ, పర్వతం బ్రంహం,పర్వతం శ్రీను,నాగులు, యాసిన్,రామారావు,అహ్మద్,నారసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కడప జిల్లాలో పోలీసుల వేధింపు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

అన్నవరం దేవస్థానం అవినీతిపై విజిలెన్స్ విచారణ ప్రారంభం

Satyam NEWS

జీఎస్టీ ప్రతిపాదనలపై తెలంగాణ సీఎం అభ్యంతరం

Satyam NEWS

Leave a Comment