విశాఖలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడి పర్యటన ఆడుకుంటామని వైసిపి నేతలు చెప్పడం చేతకాని దద్దమ్మ పని అని టీడీపీ ఎమ్మెల్యే లు వ్యాఖ్యానించారు. విశాఖ రాజధానిగా మారితే లుంగీల బ్యాచ్, ఫ్యాక్షనిజం పెరుగుపోతుందని వారు అన్నారు. విశాఖ పరిపాలన గా రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పడం ఏమిటి? ఆల్రెడీ విశాఖ టీడీపీ హయాంలో అభివృద్ధి చెందిన నగరం అని వారన్నారు.
వైసిపి ప్రభుత్వం వచ్చాక విశాఖ నగరంలో పూర్తి గా అభివృద్ధి ఆగిపోయిందని వారన్నారు. విశాఖ లో ఉన్న నియోజక వర్గాల సమస్యల పై జీవీఎంసీ కమిషనర్ కి టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు లు వివరించారు.