గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మిపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. చిలకలూరిపేట శాసన సభ్యురాలు రజనీ వాయిస్ రికార్డ్ చేసారని ఫిర్యాదు వచ్చిందని కారణం చెబుతూ విద్యాశాఖ అధికారులు ధనలక్ష్మి ని సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హైకోర్టు సస్పెన్షన్ ఆర్డర్ ను సస్పెండ్ చేయడం శుభపరిణామం అన్నారు. ధనలక్ష్మి శారదా పాఠశాల అభివృద్ధి కి చేసిన కృషి ఫలితంగా నే ఈ రోజు సస్పెన్షన్ ను కోర్ట్ రద్దు చేసిందన్నారు. పాలకులు అధికారులు ఉపాధ్యాయుల నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా చర్యలకు పాల్పడితే వారి పక్షాన ప్రజలు అండగా నిలుస్తారని తెలిపారు.