జగన్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల పై వరుస పెట్టి దాడ జరగడం దారుణమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ పేర్కొంది. ఇటీవల వరుసగా వార్తలు మోసే రిపోర్టర్ లు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పై దాడులు జరగడం హేయమైన చర్య అని ఏపీయూడబ్ల్యూజే అంది.
ఈమేరకు రాష్ట్రంలో Blowing, హైదరాబాద్ లో లపై దాడులు పై…విజయనగరం జిల్లా లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ నాగలక్ష్మీ ని కలిసి… యూనియన్ విజ్ఞాపన పత్రం ఇచ్చింది. అనంతరం యూనియన్ నేతలైన అప్పారావు, మహాపాత్రో, రవికుమార్, శర్మ, బూరాడ శ్రీనివాసరావు,లక్ష్మణ్,శంకరరావు, సురేష్.
వైఎస్ పంతులు,..కలెక్టరేట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నేత పంచాది అప్పారావు మాట్లాడుతూ… ప్రభుత్వం లో లోపాలను… ప్రజలకు అందుతున్న సంక్షేమ పధకాలలో లోపాలను ఎత్తి చూపే రిపోర్టర్ లపై ఇటీవల వరుసగా దాడులు జరగడం హేయమైన చర్యలన్నారు ముఖ్యంగా అధికార పార్టీ ఎంపీ అవినాష్ కేసు విషయంలో వాస్తవాలను తెలియచెప్పేందుకు హైదరాబాద్ లో రిపోర్టర్ లపై దాడులకు
పాల్పడటం దేనికి కారణమని ప్రశ్నించారు. అలాగే నంద్యాల లో కూడా… రిపోర్టర్ లపై దాడులు జరగడం… వెనుక ఆంతర్యం ఏంటో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలన్నారు. వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు చెప్పడంలో ప్రింట్ అండ్ మీడియా రంగాలు గురుతరమైన బాధ్యత గా వెళుతూ ఉంటాయని..
దాన్ని తప్పు గా తప్పు ద్రోవలో ఏవే ఆపాదించి…చివరకు రిపోర్టర్ లపై దాడులకు పాల్పడటం సరికాదని…ఈ విషయంపై కలెక్టర్ నాగలక్ష్మి వి యూనియన్ నేతలు.. వినతిపత్రం ఇచ్చామని…పేర్కొన్నారు.