నిర్మల్ జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట నష్టపరిహారం ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. గులాబి పురుగు కారణంగా జిల్లాలో అనేక మంది రైతులపంటలు నష్టపోయారని బిజెపి తెలిపింది. ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి పత్తి, సోయా బీన్ కు నష్టపరిహారం ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది.
అదేవిధంగా 2018- 19, 2019-20 కింద ఫసల్ బీమా ప్రీమియం చెల్లించిన రైతుకు ఇంకా ఇన్సూరెన్స్ డబ్బులు అందలేదని వారు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రావడం లేదని, అదేవిధంగా పంట పెట్టుబడి సహాయం రైతు బంధు ఇవ్వాలని బిజెపి కోరింది.
రబీ సీజన్ మొదలయింది కావున సకాలం లో ఇవ్వాలని రైతును ఆదుకోవాలని బిజెపి నేతలు సుహాసిని రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి నారాయణ్ రెడ్డి, కొత్తపల్లి సంతోష్, జిల్లిపెల్లి అశ్విన్, మోహన్ అగర్వాల్, సతీష్ రెడ్డి, అజయ్, కిరణ్ పాల్గొన్నారు.