37.2 C
Hyderabad
May 1, 2024 14: 36 PM
Slider గుంటూరు

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దొంగల ముఠా

#cmjagan

చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లను దొంగల ముఠాగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు జత కడతారు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు విడిపోతారు అంటూ వారిద్దరిని  ఉద్దేశించి జగన్ అన్నారు. విడి విడి గా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను చిల్చాలి అనుకుంటే చిల్చుతారు. తమకు గిట్టని ప్రభుత్వం ఏదైనా సరే చీల్చ కూడదు అనుకుంటే ఏకమై పోతారు అని ఆయన వ్యాఖ్యానించారు.

పేరుకు వేరు వేరు పార్టీలు అయినా… ఈ ఇద్దరూ గజ దొంగల ముఠా అని సీఎం వ్యాఖ్యానించారు. అధికారం తప్ప వారికి ఏ ఏ జెండా లేదని సీఎం అన్నారు. మంచి చేస్తే జగన్ ను ఆశీర్వదించండి…. చంద్ర బాబు ని వారి దత్తా పుత్రుడిని నమ్మకండి అని ఆయన అన్నారు. పల్నాడు జిల్లా నరసరావు పేట సభలో  సిఎం జగన్ మోహన్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పల్నాడు యుద్ధంలాగా మనం చేస్తున్న యుద్ధం  స్టయిట్ గా కాదు మారీచుల్లాంటి రాక్షసులు తో పరోక్ష యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర o శ్రీలంక అవుతుందని చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. వీరిద్దరూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేని దుర్మార్గులు అని ఆయన అన్నారు.

ఖజానాను కొల్లగొట్టిన దొంగల ముఠా ఇది అని సీఎం అన్నారు. ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో చాలా విషయాలు చెప్పి తరువాత చెత్త బుట్టలో వేసి హైదరాబాద్ లో ఉంటున్న దొంగల ముఠా ఇది అని ఆయన అన్నారు. భవిష్యత్తు లో ప్రజలు ఓటు వేయరని ఈ దొంగల ముఠా భయపడుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పధకాలు ప్రజలకు అందితే వారి బాక్సులు బద్దలు అవుతాయి అని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది వీళ్ళే…దోచుకున్నది వీల్లే…అని సీఎం అన్నారు. అసూయకు మందు లేదని జగన్ చెప్పారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

కరోనా హెల్ప్: బిజెపి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

Satyam NEWS

జెర్సీ ఆవుకు ఒకే ఈతలో రెండు దూడలు

Satyam NEWS

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పద్మశాలి సంఘం భేటీ

Satyam NEWS

Leave a Comment