కడప జిల్లా వేంపల్లి మండలంలోని సీఎం సొంత నియోజకవర్గం లో వైసీపీ లో వర్గ విభేదాలు భగ్గు మన్నాయి.
వేంపల్లి మండలం ఇడుపుల పాయ పంచాయతీ లోని విరన్నగట్టు పల్లె లో గ్రూపు లుగా విడిపోయి వైసిపి పార్టీ కార్యకర్తలు ఘర్షణ కు దిగినారు.
పుల్లయ్య వర్గానికి చెందిన నలుగురిని చలపతి వర్గం తీవ్రంగా గాయపరిచినారు. గాయపడిన వారిని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
ఇడుపులపాయ ఆర్కె వ్యాలీ పోలీసులు ఇరువర్గాల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.