28.7 C
Hyderabad
April 28, 2024 05: 02 AM
Slider నెల్లూరు

టెలిఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తా

#kotamreddy

మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న తననే అనుమానించి తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారంటే వారి మనస్తత్వం ఎలాంటిదో ప్రజలు అందరూ అర్ధం చేసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వివరాలను ఆయన నేడు బయట పెట్టారు. ఈ ట్యాపింగ్ విషయాన్ని కేంద్ర హోంశాఖ,దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.

ఒక శాసనసభ్యుడు ఫోన్ సంభాషణను దొంగచాటుగా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ప్రభుత్వ పెద్దలే ఫోన్ టైపింగ్ చేస్తుంటే ఎవరి దృష్టికి తీసుకువెళ్లాలి? అనుమానించిన చోట ఉండలేని కారణంగానే ఈ విషయాన్ని బయట పెడుతున్నాను. నా ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ విధానాన్ని నేను అనుసరించా అని ఆయన తెలిపారు.

తన ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది అనేందుకు గల ఆడియో ఆధారాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. శ్రీధర్ రెడ్డి అతని స్నేహితుడు మధ్య జరిగిన సంభాషణ ఆడియో రికార్డును బయటపెట్టి..ఇది ఎలా వచ్చిందో చెప్పాలంటూ ప్రశ్నించారు. రెండు ఐఫోన్లు మధ్య సంభాషణలు రికార్డు చేయడం వీలు కాదు అలాంటి రికార్డింగ్ అని చెప్పడం విడ్డూరం. ఆడియోలు బయట పెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇబ్బంది పడతారని చెప్పానని తెలిపారు. తాను చెప్పిన విషయాలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కొట్టిపడేశారు..కనుకనే ఆడియోలు  బయట పెడుతున్నా అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

ఏపి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు..9849966000 నెంబర్ నుంచి నాకు కాల్ చేశారు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని రామాంజనేయులు నాతో చెప్పారు… ఆయన పంపినదే..నా మిత్రుడి తో మాట్లాడిన సంభాషణ..ఇది ట్యాపింగో..కాదో..మీ వ్యవస్థల ద్వారా తేల్చి చెప్పండి అని ఆయన అన్నారు. నేను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవక ముందు నుండే నా ఫోన్ ట్యాపింగ్ జరిగుతుంది.

నా ఫోన్ ట్యాపింగ్ విషయం బయట పెట్టాక..ఇద్దరు మంత్రులు, ఐదుమంది ఎంపి లు,30 మందికి పైగా ఎమ్మేల్యేలు కాల్ చేశారు. వాళ్ళ ఫోన్ లు టాప్ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు అని ఆయన తెలిపారు. ట్యాపింగ్ విషయం తెలిసిన తరువాత మౌనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించాలి అనుకున్నా… ఇలాంటి అనుమానపు చూపులు, అవమానాలకు గురి చేయడంతో అన్ని విషయాలూ బయటపెడుతున్నా అని ఆయన అన్నారు.

Related posts

కేంద్ర ప్రభుత్వం తక్షణమే 12 శాతం గిరిజన రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి

Satyam NEWS

ఒకేదేశం, ఒకే జెండా మాదీ అదే నినాదం

Satyam NEWS

రైతు రాజ్యానికి గుర్తు రైతు వేదికల నిర్మాణం

Satyam NEWS

Leave a Comment