ఈ నెల 26 వ తేదీ సోమవారం రోజు న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లా లో టీడీపీ రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ సందర్భంగా అశోక్ గజపతి… కొన్ని సూక్తులు చెప్పారు. తన పుట్టినరోజు నేపథ్యంలో… మహాకవి గురజాడ వాక్యాలైన..”దేశమును ప్రేమించుమన్న…ఒట్టి మాటలు కట్టిపెట్టి…గట్టి మేలు తలపెట్టవోయ్..” అన్న మాటలు… అశోక్ నోటి వెంట రావడం విశేషం. ఈ సందర్భంగా అశోక్ గజపతి మాట్లాడుతూ… నా పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం…మంచి విషయమని చెప్పారు. ప్రతీ ఒక్కరూ.. ఎంతో కొంత సమయం… సమాజానికి వెచ్చించాలన్నారు. నా కుటుంబం అన్న విధంగా కాకుండా సమాజ పరంగా ప్రతీ ఒక్కరూ ఆలోచించి పని చేయాలన్నారు.18వ శతాబ్దంలో నే విజయనగరంకు చెందిన గురజాడ అప్పారావు… సమాజం కొరకు పని చేసారని.. ప్రస్తుతం ఈ స్పీడ్ యుగంలో..”గురజాడ” సూక్తులను పాటించాలన్నారు. ఈ పరిస్థితుల్లో… పార్టీ పరంగా ఈ తరహా రక్తదానం శిబిరం నిర్వహించడం…సంతోషకరమైన విషయమని…అశోక్ గజపతిరాజు అన్నారు.
previous post
next post