36.2 C
Hyderabad
April 27, 2024 21: 36 PM
Slider ముఖ్యంశాలు

సీఆర్ పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టుల దాడి

maoist attack on crpf camp

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు  గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని ఎల్మగుండ క్యాంప్‌పై మావోయిస్టులు కాల్పులకు దిగారు.. దీంతో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఈ మధ్యే ఎల్మగుండలో క్యాంప్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ రెండో బేటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ హేమంత్‌ చౌధరి, కానిస్టేబుళ్లు బసప్ప, లలిత్‌ బాఘ్‌ గాయపడ్డారని చెప్పారు. కాగా, ఆ ప్రాంతంలో మవోయిస్టుల కోసం పోలీసులు  గాలింపు ముమ్మరం చేశామన్నారు.

Related posts

ఆత్మకూరు ప్రాంతంలో పెద్ద పులి పిల్లల కలకలం

Satyam NEWS

బండి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం

Sub Editor

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఎర్రబెల్లి

Satyam NEWS

Leave a Comment