కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు… పార్టీ సీనియర్ నేత…మాన్సాస్ చైర్మన్ పీ.అశోక్ గజపతిరాజు పుట్టిన రోజు సందర్భంగా 25 వ తేదీ అశోక్ బంగ్లా లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తోంది… ఆ పార్టీ. ఈ నెల 26 వ తేదీ సోమవారం అశోక్ గజపతిరాజు జన్మ దినం.ఈ సందర్భంగా ఒక్క రోజు ముందు అంటే 25వ తేదీ ఆదివారం పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లా లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న ట్లు పార్టీ నగర కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అశోక్ బంగ్లా లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు విజయనగరం మండల అధ్యక్షుడు బొద్దుల నర్సింగరావు ,ఐవీపీ రాజులు మాట్లాడారు. అశోక్ జన్మదినం సందర్భంగా.. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, స్వచ్చంద సేవకలు…పెద్ద ఎత్తున ఈ మెగా బ్లడ్ డొనేషన్ కు హాజరు కావాలని కోరారు
next post