కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. వైఎస్ షర్మిల ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పలుమార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఢీకేతో భేటీ అయిన మరుసటి రోజే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం, షర్మిల మధ్య చర్చలు జరిగినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఏపీలో షర్మిల సేవలను వాడుకునేందుకు వీలుగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయాలంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రతిపాదించారని.. విలీనానికి షర్మిల ఇష్టపడలేదనే వార్తలు వచ్చాయి. విలీనం లేదా పొత్తు ప్రతిపాదనలపై అటు హైకమాండ్, ఇటు షర్మిలకు మధ్య సమన్వయకర్తగా శివకుమార్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
next post